సోనియా హెలీకాప్టర్లో సాంకేతిక లోపం

27 Apr, 2014 17:39 IST|Sakshi

చేవెళ్ల: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణించాల్సిన హెలీకాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సోనియా రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు వచ్చారు. బహిరంగ సభ అనంతరం మెదక్ జిల్లా ఆందోల్కు వెళ్లాల్సివుంది.

అంతకుముందు ఓ మోస్తారు వర్షం పడటం, ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సోనియా హెలీకాప్టర్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో సోనియా రోడ్డు మార్గాన కారులో బయల్దేరారు. ఆర్మీ హెలీకాప్టర్లో తీసుకెళ్తామని కోరినా అందులో ప్రయాణించేందుకు సోనియా నిరాకరించారు.

మరిన్ని వార్తలు