కిశోర్ చంద్రదేవ్ నామినేషన్లో ఉద్రిక్తత

17 Apr, 2014 13:16 IST|Sakshi
కిశోర్ చంద్రదేవ్ నామినేషన్లో ఉద్రిక్తత

అరకు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కిశోర్‌ చంద్రదేవ్‌ నామినేషన్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు బయల్దేరిన కిశోర్‌ చంద్రదేశ్‌ కాన్వాయ్‌పై కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి గంగాధర్‌ వర్గీయులు  దాడి చేశారు.

దాంతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పాటు అక్కడ 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గంగాధర్ రెబెల్గా నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు