ఈవీఎం స్ట్రాంగ్రూం వద్ద ఆగంతకుల కదలిక

10 May, 2014 13:21 IST|Sakshi

విశాఖ : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని సోఫియా కళాశాల స్టాంగ్ రూం వద్ద ఆగంతకులు సంచారం కలకలం రేపుతోంది. టీడీపీ ఎన్నికల ఏజెంట్తో ఓ పోలీసు అధికారి మంతనాలు జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ శనివారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు.

ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూంల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరపాలని దాడి రత్నాకర్ భన్వర్ లాల్కు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలకు మూడంచెల పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసినా వాటి భద్రత మాత్రం సవాల్గా మారుతోంది. కాగా ఈ నెల 16న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు