ఏ పార్టీకి భయపడడం లేదు: సీఈసీ

8 May, 2014 18:07 IST|Sakshi
ఏ పార్టీకి భయపడడం లేదు: సీఈసీ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వీఎస్ సంపత్ తెలిపారు. తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. విధుల నిర్వహణలో ఏ పార్టీకి భయపడడం లేదని స్పష్టం చేశారు. ధైర్యంగా, నిజాయితీగా తమ పని తాము చేసుకుపోతున్నామని చెప్పారు. ఎన్నికల సంఘంపై రాజకీయ పార్టీల విమర్శలు బాధాకరమని పేర్కొన్నారు.

భద్రతా ఏర్పాట్ల విషయంలో స్థానిక అధికారుల సూచనలు పాటిస్తున్నామని వెల్లడించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఎన్నికల సంఘం ఒకటని అన్నారు. వారణాసిలో నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సముచితమేనని సమర్థించుకున్నారు. అమేథీలో రాహుల్ గాంధీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నివేదిక కోరామని వీఎస్ సంపత్ తెలిపారు.

మరిన్ని వార్తలు