చంద్రబాబుపై కలెక్టర్కు ఫిర్యాదు

5 May, 2014 14:19 IST|Sakshi

కడప : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు సభలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలే టార్గెట్గా ప్రసంగం కొనసాగిన విషయం తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు