వైఎస్సార్‌సీపీ తొలిటీం ఇదే

9 Apr, 2014 03:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని రెండు లోక్‌సభ స్థా నాలతో పాటు ఎనిమిది అసెం బ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మ హబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీన ర్ హెచ్.ఎ.రహమాన్ పేరును ఖరారు చేశారు. నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం నుంచి జట్టి ధర్మరాజు పోటీ చేస్తారు.
 
 మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ నుంచి వర్కటం జగన్నాథ్‌రెడ్డి, నారాయణపేట నుంచి దేవసేనరెడ్డి పోటీ చేస్తారు. పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, అచ్చంపేట ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి భీష్వ రవీందర్, నాగర్‌కర్నూలు నుంచి మల్లేపల్లి శ్రీనివాస్‌రెడ్డి, షాద్‌నగర్ నుంచి బొబ్బిలి సుధాకర్‌రెడ్డికి అవకాశం దక్కింది. కొల్లాపూర్ నుంచి యాపర్ల మహేశ్వరి, ఆలంపూర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి బంగి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ వేసిన రహమాన్ బుధవారం లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మిగిలిన స్థానాలకు బుధవారం ఉదయం అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది.
 

>
మరిన్ని వార్తలు