ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని

27 Sep, 2017 23:49 IST|Sakshi

దేవీనవరాత్రులు

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున దుర్గాదేవి శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఇది ఆఖరి రోజు. దీనికే దుర్గాష్టమి అనే పేరు వాడుకలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం సకల దేవీ, దేవతల శక్తి స్వరూపంగా ఈ తల్లి ఆవిర్భవించింది. ఇది అత్యుగ్రరూపం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ అవతారంలో అమ్మ సింహవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషుడిని సంహరిస్తున్న రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని ఉపాసించడం ద్వారా సకల భయాలు, శత్రుపీడ, రోగాలు దూరమవుతాయి.

విశ్వశాంతి కలుగుతుంది. శత్రువిజయాన్ని కాంక్షించేవారు ఈ తల్లిని ఉపాసించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజున చండీ సప్తశతీ పారాయణ, హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మంత్రం: ‘ఓం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని జపించడం మంచిది.
నైవేద్యం: గారెలు, పులిహోర, పొంగలి

మరిన్ని వార్తలు