ప్రాచీన ప్రదేశాలు ఆధునిక నామధేయాలు

20 May, 2018 01:44 IST|Sakshi

మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్‌ ధాం, నేపాల్‌.
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్‌.
భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్‌
నిర్యాణానికి ముందు శ్రీ కృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్‌.
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం, ఉత్తర్‌ ప్రదేశ్‌.
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం) – నేపాల్‌ లోని తిలార్కోట్‌.
కాంభోజ రాజ్యం – ఇరాన్‌ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు) – లాంగకో, టిబెట్, చైనా
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం – బోధ్‌ గయ, బీహార్‌.
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు – కుశీనగర్, ఉత్తర్‌ ప్రదేశ్‌.
పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు – గోకర్ణ, కర్ణాటక
 సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్‌
మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్‌ పూర్, నేపాల్‌
కోసలదేశం – అయోధ్య నుండి నేపాల్‌ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్, ఉత్తర్‌ ప్రదేశ్‌.
సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది.

మరిన్ని వార్తలు