పొడిచర్మం ఉన్నవారు శీతాకాలంలో రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి ఆముదం కాని కొబ్బరి నూనె కాని రాసి ఉదయాన్నే కడిగేస్తే మృదువుగా వుంటుంది.
నార్మల్ స్కిన్కి ఒక టీ స్పూన్ తేనె తీసుకుని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా ఇలా చేస్తుంటే చర్మం పొడిబారదు.
జిడ్డు చర్మానికి కోడిగుడ్డులోని తెల్లసొన రాసి ఆరిన తర్వాత కడగాలి. ఈ ప్యాక్ను ఈ కాలంలో వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే చాలు.
కీరదోస, కమలాపండు తొక్కలను రుబ్బి ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇది ఏ తరహా చర్మానికైనా వేయగలిగిన ప్యాక్.