బ్యూటిప్స్‌

22 Sep, 2017 21:10 IST|Sakshi
బ్యూటిప్స్‌

సోంపు ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే కేశాలు బాగా పెరుగుతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. రెండు లీటర్ల నీటిలో రెండు గుప్పెళ్ల సోంఫు ఆకులను వేసి మరిగించి దించాక కొంచెం సేపు కదిలించకుండా అలాగే ఉంచాలి. నీరు ఆకులలోని సుగుణాలను ఇముడ్చుకుంటుంది. ఈ నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ వెనిగర్‌ను కలిపి తలస్నానం పూర్తయ్యాక జుట్టుకంతటికీ పట్టేటట్లు పోయాలి.

చర్మం మీద నల్లటి మచ్చలుంటే బీర ఆకులను మెత్తగా పేస్టు చేసి అప్లయ్‌ చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు చేస్తుంటే వారం రోజుల్లో మచ్చలు మాయమవుతాయి.

చెమట వాసన శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే బిల్వ ఆకులను మెత్తగా నూరి ఒంటికి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే దుర్వాసన సమస్య తగ్గుతుంది.

లెట్యూస్‌ ఆకులను(క్యాబేజీ లాగా ఉంటుంది, ఆకులు మరింత పలుచగా ఉంటాయి) గ్రైండ్‌ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇది అదనపు జిడ్డును తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడంలో చక్కగా పని చేస్తుంది.
 

మరిన్ని వార్తలు