ఒక టీ స్పూన్ ఓట్మీల్ తీసుకుని అందులో టీ స్పూన్ పచ్చిపాలు లేదా పాలమీగడ వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల సేపు వలయాకారంగా మర్దనా చెయ్యాలి. మర్దన పూర్తయ్యాక పది నిమిషాల ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగితే చర్మం పొడిబారకుండా కోమలంగా ఉంటుంది.
టీ స్పూన్ అరటిపండు గుజ్జులో అయిదారు తేనె చుక్కలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా సుమారు పదిరోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.