మహిళా రైతు ‘శ్వేతా’నందం!

11 Sep, 2018 05:43 IST|Sakshi

ప్రొఫెషనల్‌ డిగ్రీ చేసినా మేకల పెంపకం చేపట్టారు శ్వేత. ఎన్‌.ఐ.ఎఫ్‌.టి.లో ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక బెంగళూరులో నివాసం. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి వద్ద ఖాళీగా గడుపుతూ ఉండేది. భర్తతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఒక మేకల పెంపక క్షేత్రాన్ని చూసి ముచ్చటపడింది. అంతే.. చిన్న జీవాలు పెంచే మహిళా రైతుగా మారిపోయింది. విశేషమేమిటంటే.. భర్తకు నచ్చజెప్పి డెహ్రాడూన్‌ దగ్గర్లోని రాణిపోక్రి గ్రామానికి మకాం మార్చి మరీ.. మేకల పెంపకం చేపట్టింది. ఆన్‌లైన్‌ అమ్మకాలతో ఏటా రూ. 25 లక్షల టర్నోవర్‌ చేస్తోంది! హేట్సాఫ్‌ శ్వేతా!!

మరిన్ని వార్తలు