హెల్త్‌ టిప్స్‌

18 Jun, 2018 00:55 IST|Sakshi

టీ స్పూన్‌ నిమ్మరసం, అర టీ స్పూన్‌ అల్లం రసం, పావు టీ స్పూన్‌ మిరియాలపొడి కలిపి రోజుకి రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
 ఆహారంలో క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తింటే కంటి సమస్యలతోపాటు ఒంట్లో కొవ్వుకణాలు  కూడా తగ్గుతాయి.  శరీరం తేలికగా అనిపిస్తుంది.
ఎసిడిటీ, అజీర్తితో బాధపడుతుంటే ఉదయాన్నే పరగడుపున టీ స్పూను అల్లంరసంలో అయిదారు చుక్కల తులసి రసం లేదా చిటికెడు మెంతిపొడి కలిపి తీసుకోవాలి.

మరిన్ని వార్తలు