హెల్త్‌ టిప్స్‌

11 Jun, 2017 23:36 IST|Sakshi
హెల్త్‌ టిప్స్‌

పళ్లు, చిగుళ్లకు సంబంధించి ఏ రకమైన అసౌకర్యం ఉన్నా పుదీనా ఆకులను నమిలినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత ఒకటి–రెండు పుదీనా ఆకులను తింటే నోట్లో క్రిములు చేరవు. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఉదయం, సాయంత్రం రెండు– మూడు ఆకులను నములుతుంటే శ్వాస తాజాగా ఉంటుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గ్రీన్‌ టీ తాగుతున్నట్లయితే ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. దీనిని పరగడుపున తీసుకుంటే మంచిది.

ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక కప్పు వేడినీటిలో ఒక టీ స్పూను నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రపడుతుంది.  విరేచనాలతో బాధపడుతుంటే దానిమ్మగింజలు, కిస్‌మిస్‌లో చిటికెడు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.పిల్లలు ఒక్కొక్కసారి వాళ్లకు ఆకలి వేస్తున్నా కూడా నోటికి రుచించక ఏదీ తినకుండా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటప్పుడు ఒక టీ స్పూను తేనెలో అంతే మోతాదులో అల్లం రసం కలిపి నాలుకకు రాయాలి. ఇలా చేస్తే నోటి అరుచి పోయి లాలాజల గ్రంథులు ఉత్తేజితం అవుతాయి. అప్పుడు చక్కగా తింటారు.

మరిన్ని వార్తలు