వేడి వేడి పకోడి...

28 Apr, 2016 00:03 IST|Sakshi
వేడి వేడి పకోడి...

ఇంటిప్స్
బియ్యాన్ని నానబెట్టి రుబ్బి సెనగపిండిలో కలిపి పకోడీలు వేస్తే కరకరలాడటమే కాకుండా రుచిగా ఉంటాయి.
మామూలు పెనంపై కొద్దిగా ఉప్పు వేసి వేడిచేసి, ఆ తర్వాత ఆ ఉప్పును తీసేయాలి. తర్వాత నూనె రుద్ది.. దోసె, అట్లు లాంటివి వేస్తే నాన్‌స్టిక్ పాన్‌లా పనిచేస్తుంది.
పాలు మాడువాసన వస్తే రెండు తమలపాకులు వేసి కాసేపు వేడిచేయాలి.
పచ్చళ్లు బూజు పట్టకుండా ఉండాలంటే చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి జాడీలో పెట్టి పైన మూత ఉంచాలి. అరగంట తర్వాత జాడీలో నుంచి ఇంగువ ముక్కను తీసేయాలి.

 

మరిన్ని వార్తలు