సుంకోజి దేవేంద్రాచారి నవల ‘రెక్కాడినంత కాలం’ ఆవిష్కరణ ఆగస్టు 27న ఉదయం 10:30కు తిరుపతి ప్రెస్క్లబ్లో జరగనుంది. ఆవిష్కర్త: మధురాంతకం నరేంద్ర. నిర్వహణ: తిరుపతి ప్రెస్క్లబ్
‘వెయ్యేళ్ల తెలుగు సాహిత్య పరిచయం’గా మందలపర్తి కిశోర్ రాసిన ‘పెరటి చెట్టు’ ఆవిష్కరణ ఆగస్టు 30న సాయంత్రం 5:30కు విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో జరగనుంది. ఆవిష్కర్త: డాక్టర్ దీర్ఘాశి విజయభాస్కర్.
వేమన వసంతలక్ష్మి ‘సండే కామెంట్స్’ పుస్తక పఠనం కార్యక్రమం సెప్టెంబర్ 2న సాయంత్రం 4 గంటలకు అస్మిత రిసౌర్స్ సెంటర్ ఫర్ విమెన్, హైదరాబాద్లో జరగనుంది. నిర్వహణ: అస్మిత కలెక్టివ్.
శేషభట్టర్ కవితాసంపుటి ‘మోహధూపం’ ఆవిష్కరణ సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరగనుంది. ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి. నిర్వహణ: పాలపిట్ట బుక్స్.
‘కామన్ డయాస్’ ఆధ్వర్యంలో నాళేశ్వరం శంకరం కవిత్వంపై సమాలోచన, రఘుశ్రీకి సత్కారం, కవి సమ్మేళనం, చర్చ కార్యక్రమాలు సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు బీసీ సాధికారత సంస్థ, హిమాయత్నగర్లో జరగనున్నాయి.
ఎన్.రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం–2018 కోసం 2016–18 మధ్య వెలువడిన తెలుగు విమర్శ గ్రంథాలను సెప్టెంబర్ 25లోగా ఆహ్వానిస్తున్నారు. పురస్కార నగదు పదివేలు. ప్రదానం నవంబర్ 12న. చిరునామా: డాక్టర్ ఎన్.రామచంద్ర, 26–905, నాగేంద్ర నగర్, ప్రొద్దుటూరు–516360. ఫోన్: 9293924501. నిర్వహణ: సాహితీ మిత్రమండలి.
అవనిగడ్డ, గాంధీక్షేత్రం వారు కోడీహళ్లి మురళీమోహన్, కస్తూరి మురళీకృష్ణ సంపాదకులుగా అక్టోబర్ 2 నాటికి మహాత్మాగాంధీ జీవితం, సిద్ధాంతాల ఆధారంగా తెలుగులో వచ్చిన కథలతో సంకలనం తేనున్నారు. ఇట్లాంటి కథల వివరాలు తెలిస్తే 9701371256కు తెలియజేయాలని కోరుతున్నారు.