గంటి భానుమతి రెండు నవలలు తమసోమా జ్యోతిర్గమయ, పడి లేచిన కెరటం ఆవిష్కరణ సభ మార్చి 11న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య కళానిలయంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్.
డాక్టర్ కె.అన్ష ‘గడచిన రెండు దశాబ్దాల హిందీ కథ– శ్రామిక వర్గ సమస్యలు’(హిందీ) ఆవిష్కరణ మార్చి 12న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి మినీ హాల్లో జరగనుంది. నిర్వహణ: తెలంగాణ రచయితల సంఘం.
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా మార్చి 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నవీన్ నవల అంపశయ్య గురించి కె.పి.అశోక్ కుమార్ ప్రసంగిస్తారు.
జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట శాఖ 33వ వార్షికోత్సవం మార్చి 15న మధ్యాహ్నం 3 కు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జరగనుంది. పలు పురస్కారాల ప్రదానాలు, పుస్తకావిష్కరణలు జరగనున్నాయి.
ప్రభాకర్ మందార తెలుగులోకి అనువదించిన జె.వి.పవార్ ఆంగ్ల రచన ‘దళిత్ పాంథర్స్ చరిత్ర’ ఆవిష్కరణ మార్చి 15న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్లోని లామకాన్లో జరగనుంది. బెజవాడ విల్సన్తో చర్చ ఉంటుంది. నిర్వహణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
ఉషశ్రీ సంస్కృతి సత్కారాన్ని గరికపాటి నరసింహారావుకు మార్చి 15న సాయంత్రం 6:03 గంటలకు హైదరాబాద్, బర్కత్పురాలోని యాదాద్రి కల్యాణ మండపంలో చేయనున్నారు. కె.వి.రమణాచారి, కె.వరప్రసాద్రెడ్డి, ఎన్.అనంతలక్ష్మి, కడిమెళ్ల వరప్రసాద్ పాల్గొంటారు. నిర్వహణ: ఉషశ్రీ మిషన్.
మునిపల్లె రాజు సాహిత్య పురస్కారాన్ని విహారికి మార్చి 16న సాయంత్రం 5:30కు త్యాగరాయ గానసభలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: మునిపల్లె రాజు కుటుంబ సభ్యులు, శ్రీ త్యాగరాయ గానసభ.
సాహిత్య అకాడమీ, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా మార్చి 17న సాయంత్రం 5 గంటలకు హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ‘విమర్శకునితో ఒక సాయంత్రం’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో కోవెల సుప్రసన్నాచార్య తన విమర్శ ప్రస్థానం గురించి ముచ్చటిస్తారు.
బాలచెలిమి పత్రిక ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల బడి పిల్లల కథలను 13 సంకలనాలుగా ప్రచురించనుంది. ప్రధానోపాధ్యాయుడి ధ్రువపత్రంతో ఒకవైపునే రాసిన రెండు ఏ4 కాగితాలకు మించని కథలను మార్చి 20లోగా పంపాలి. చిరునామా: చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి, 3–6–716, స్ట్రీట్ నం. 12, హిమాయత్ నగర్, హైదరాబాద్–29. ఫోన్: 8686664949