భరత్‌ అనే మహేశ్‌బాబు కోసం...

10 May, 2018 12:13 IST|Sakshi
మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కొరటాల, దేవిశ్రీ ప్రసాద్, రవిచంద్రన్‌...

కొరటాల శివ అనే దర్శకుడు ఇప్పటివరకూ మూడు సినిమాలు చేశారు. మూడింటికీ దేవిశ్రీ ప్రసాద్‌ అనే సంగీత దర్శకుడు స్వరాలు, నేపథ్య సంగీతం అందించారు. హిట్‌ కాంబినేషన్‌ అనే పేరొందిన ఈ ఇద్దరూ హ్యాట్రిక్‌ హిట్స్‌ తర్వాత నాలుగోసారి కలసి పని చేస్తున్నారు. ఏదో కొత్తవాళ్లను అన్నట్లుగా ‘అనే..’ అంటున్నారేంటి అనుకుంటున్నారా? మరేం లేదు.

మహేశ్‌బాబు హీరోగా నటించనున్న ‘భరత్‌ అనే నేను’కి కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఆల్రెడీ మూడు ట్యూన్స్‌ ఫైనలైజ్‌ చేశారు. దుబాయ్‌లో జరిగిన ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్‌ రవి కె.చంద్రన్‌ కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు