కూతురి పెళ్లి కోసం

23 Aug, 2019 08:07 IST|Sakshi
నళిని

నళినీ శ్రీహరన్‌ పెరోల్‌ను మద్రాస్‌ హైకోర్టు పొడిగించింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడం కోసం తనను విడుదల చేయాలని నళిని చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఆమెకు నెల రోజుల సమయాన్ని ఇస్తూ, జూలై 25న విడుదల చేసింది. ఆ గడువు ముగిసినప్పటికీ పెళ్లి పనులు పూర్తి కాకపోవడంతో కోర్టు మరో మూడు వారాల సమయాన్ని నళినికి మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని ఇరవై ఐదేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు.

మరిన్ని వార్తలు