సేంద్రియ ఆహారాన్ని అందించే ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతపై ఈనెల 12(ఆదివారం)న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (ఆదివారం బజారు)లోని డా. గొట్టుముక్కల సుందర రామరాజు ఐ.ఎం.ఎ. కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారతీయ కిసాన్ సంఘ్ నేత జె.కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు బి. రామకృష్ణంరాజు తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. పి.బి. ప్రతాప్కుమార్ – 94401 24253