రోహిణీ వంటకం
మండే ఎండలు తెచ్చిన రోహిణీకార్తెలో కాసింత సరదాను వెతుక్కుందాం. పచ్చిమామిడికి కాసింత పచ్చిమిర్చి కలిపి సూర్యుణ్ణి ఢీ కొడదాం. ఈ సమోసాతో ఎండ నసను తరిమి కొడదాం!
కావల్సినవి: మామిడికాయ ముక్కలు - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు
పచ్చిబఠాణీలు - కప్పు, పనీర్ ముక్కలు - కప్పు, రిఫైండ్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్, వాము - టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - కప్పు, పసుపు - అర టీ స్పూన్, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్, మొక్కజొన్న పిండి - టీ స్పూన్, క్యారట్ తరుగు - కప్పు, బీన్స్ తరుగు - కప్పు, మైదా - కప్పు, ధనియాల పొడి - టీ స్పూన్, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ: మైదాలో వేడి నీళ్లు, ఉప్పు, వాము, నెయ్యి కలిపి, ముద్ద చేసి, పైన మూత పెట్టి పక్కన పెట్టాలి మూకుడులో జీలకర్ర, సోంపు, ధనియాలు, పల్లీలు వేయించి పక్కన పెట్టాలి కడాయిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయించి, బంగాళదుంప, మామిడిముక్కలు, క్యారట్, పచ్చిబఠానీలు, బీన్స్, పనీర్, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో కొత్తిమీర, ధనియాల పొడి వేసి కొద్దిసేపు సన్నని మంట మీద ఉంచాలి పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని, పూరీలా ఒత్తుకోవాలి. చేత్తో కోన్ షేప్లో తయారుచేసుకొని, దీంట్లో ఉడికిన మిశ్రమాన్ని నింపి, నీళ్లు అద్దుకుంటూ చివర్లు సీల్ చేయాలి ఇలా అన్నీ తయారుచేసుకున్నాక కాగుతున్న నూనెలో వేసి, అన్ని వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించి, తీసి పక్కన ఉంచాలి. ఇలా తయారుచేసుకున్న సమోసాలను ఏదైనా గ్రేవీ లేదా సాస్తో సర్వ్ చేయాలి.