బరువుకు.. బ్రేక్‌ఫాస్ట్‌కూ లింక్‌!

4 Feb, 2019 00:46 IST|Sakshi

రోజులో అతిముఖ్యమైన ఆహారం ఉదయాన్నే తీసుకునే ఉపాహారమని చెబుతూంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇదేమంత మంచి సూత్రం కాదంటున్నారు మొనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఉపాహారం తినకపోతే ఆ తరువాత ఆకలి ఎక్కువై అవసరానికి మించి తింటారన్న గత అంచనాల్లో ఏమాత్రం నిజం లేదు.

అలాగే ఆరోగ్యకరమైన బరువు ఉండేందుకు బ్రేక్‌ఫాస్ట్‌ అవసరమని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయని.. తాము జరిపిన తాజా అధ్యయనంలో మాత్రం ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఇప్పటికే జరిగిన 13 అధ్యయనాల వివరాల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు చెప్పారు. వీటికి అదనంగా తాము అమెరికా, యూకేలకు చెందిన కొంతమందిపై కొన్ని పరిశోధనలు చేశామని బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోని వారు మిగిలిన వారితో పోలిస్తే తేలికగా ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు