నా కన్నులనే గిన్నెలతో తాగమన్నవి

10 Jul, 2018 19:51 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది 

కవిత్వానికి చమత్కారాన్ని జోడించి చక్కలిగింతలు పెట్టిన కవి ఆరుద్ర. ఇంకా చెప్పాలంటే చమత్కారాన్ని కూడా కవిత్వంగా మలవగలిగిన కవి ఆరుద్ర. పద ప్రయోగాల్లోనూ, వ్యక్తీకరణల్లోనూ ఆరుద్ర మార్కు తెలుస్తుంది. ‘మహాబలుడు’ చిత్రం కోసం ఆరుద్ర 

‘ఓ ఓ విశాల గగనములో చందమామా
ప్రశాంత సమయములో కలువలేమా
’ పాట రాశారు. అందులోని ఒక చరణంలో–
‘వన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి
నా కన్నులనే గిన్నెలతో 
తాగమన్నవి’
అంటాడు నాయకుడు. దానికి బదులుగా–
‘వొలికే మధువు  కొసరే వధువు
రెండూ నీవే’
అని బదులిస్తుంది నాయిక.
1969లో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం ఎస్‌.పి.కోదండపాణి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం గాయనీ గాయకులు. దర్శకుడు సినిమాటోగ్రాఫర్‌ రవికాంత్‌ నగాయిచ్‌. వాణిశ్రీ,కృష్ణ నటీనటులు.

మరిన్ని వార్తలు