సమకాలీన ముస్లిం నేపథ్య కథల సంకలనం ‘కథా మినార్’ ఆవిష్కరణ ఆగస్టు 18 శనివారం సాయంత్రం 6.30 కు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరగనుంది. సంపాదకులు: మహమ్మద్ ఖదీర్బాబు, వేంపల్లె షరీఫ్.
తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ రాష్ట్రస్థాయి నవలల పోటీ నిర్వహిస్తోంది. ఇతివృత్తం, తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించాలి. నిడివి ప్రచురణలో 100–200 పేజీలుండాలి. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు. ద్వితీయ: 75 వేలు. తృతీయ: 50 వేలు. అక్టోబర్ 10 చివరి తేది. పంపాల్సిన చిరునామా: కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్రభారతి, కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్–4.
‘జలియన్వాలాబాగ్ నూరేళ్ల సందర్భం: శతవత్సర జ్ఞాపక జ్వాల’ పేరుతో ఆగస్టు 13న సాయంత్రం 5:30కు విశాఖ పౌర గ్రంథాలయంలో కార్యక్రమం జరగనుంది. ప్రసంగం: రామతీర్థ. నిర్వహణ: మొజాయిక్ సాహిత్య సంస్థ.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఆగస్టు 11–15 వరకు వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాలలో పుస్తక మహోత్సవం జరగనుంది.
ఆగస్టు 19న ఉ. 11 గంటలకు కాకతీయ విశ్వవిద్యాలయం రెండో గేటు ముందు గల అరసం, వరంగల్ కార్యాలయంలో ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో నా సాహితీ పాత్ర’ అంశంపై మెట్టు రవీందర్ ప్రసంగిస్తారు. ప్రతి నెలా మూడో ఆదివారం జరిగే ఈ కార్యక్రమ నిర్వహణ: వరంగల్ అరసం.
మఖ్దూం మొహియుద్దీన్ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మూకదాడులు’ అంశంపై కవి సమ్మేళనం జరగనుంది. నిర్వహణ: తెలంగాణ సాహితి. వివరాలకు: 8897765417.
సత్యోదయ్ కవితా సంపుటి ‘వ్యతిరిక్త ప్రవాహమ్’ ఆగస్టు 18న ఉదయం 10.30 గం.కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నిర్వహణ: బేర్ ఫుట్ పేజెస్.