కేంద్ర సాహిత్య అకాడమీ ఇంగ్లిష్లో ప్రచురించిన తెలుగు రచయిత్రుల సమకాలీన కథాసంకలనం ‘బియాండ్ ద బ్యాక్యార్డ్’ ఆవిష్కరణ మార్చి 4న సాయంత్రం 5:30కు విజయవాడ మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్లో జరగనుంది. సంపాదకులు: సి.ఎల్.ఎల్.జయప్రద, పి.సత్యవతి, వి.ప్రతిమ. ఆవిష్కర్త: వసంత కన్నబిరాన్.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంతి ఉత్సవాలు మార్చి 5న మధ్యాహ్నం 3 గంటలకు పల్లిపాలెం, తూర్పు గోదావరిలోనూ; అదేరోజు సాయంత్రం 5:30కు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలోనూ; 9, 10 తేదీల్లో మధునాపంతుల ట్రస్టు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోనూ జరగనున్నాయి.
తెలంగాణ సాహిత్య సమాఖ్య మార్చి 6న రవీంద్ర భారతి సమావేశ మందిరంలో రశ్మిత పేరుతో ప్రత్యేక మహిళా కవి సమ్మేళనం నిర్వహించనుంది.
తెలంగాణ సాహిత్య అకాడమి కావ్య పరిమళంలో మార్చి 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో సినారె ‘నాగార్జున సాగరం’పై డాక్టర్ టి.గౌరీశంకర్ ప్రసంగిస్తారు.
తెలంగాణ అరసం ద్వితీయ మహాసభలు మార్చి 9, 10 తేదీల్లో ఆదర్శ న్యాయ కళాశాల, హన్మకొండలో జరగనున్నాయి. 9న ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమయ్యే సభలో ప్రసంగాలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనం ఉంటాయి.
డాక్టర్ పసునూరి రవీందర్ కవిత్వం ‘ఒంటరి యుద్ధభూమి’ ఆవిష్కరణ మార్చి 10న సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: గోరటి వెంకన్న. నిర్వహణ: మట్టి ముద్రణలు.
వాణిశ్రీ(సీహెచ్ శివరామప్రసాద్)కి ‘సహస్ర కథానిధి’ బిరుదును సింహప్రసాద్ సాహిత్య సమితి మార్చి 10న తెనాలిలో ప్రదానం చేయనుంది.
కథాప్రకాశం పేరుతో ప్రకాశం జిల్లా రచయితలు 2018లో రాసిన కథలతో సంకలనం తేవాలని గుండ్లకమ్మ రచయితల వేదిక సంకల్పించింది. జిల్లాతో అనుబంధం ఉన్న కథకులందరినీ కథల్ని పంపాల్సిందిగా కోరుతోంది. ఫోన్: 9989224280