నిజమైన స్నేహితులు

24 Jan, 2015 23:28 IST|Sakshi
నిజమైన స్నేహితులు

కథ
 
ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు నివసించేది. అది రోజూ వుధ్యాహ్నం ఆహారం వుుగించిన తర్వాత ఒక సెలయేటి వద్దకు వెళ్లి కడుపునిండా నీళ్లు తాగేది. ఒక రోజూ అలాగే నీశ్లు తాగి తిరిగి వెళ్తుండగా గడ్డి మీద నడుస్తున్న ఏనుగు కాలికి ఒక పెద్ద వుుల్లు గుచ్చుకుంది.

ముల్లును తొలగించుకునేందుకు ఎంతగా ప్రయుత్నించినా, ఏనుగు ప్రయుత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యూరుు. అది వుధ్యాహ్నం వేళ... అదీ వేసవికాలం కావడంతో ఎండ వేడిమి తట్టుకోలేక, ఏనుగు కుప్పకూలిపోరుుంది. అడుగు తీసి అడుగు పెట్టడం కూడా చేతగాక ఏనుగు నీరుగారి పోరుుంది. ఏనుగు బాధతో ములుగుతుండగా అటువైపు వచ్చిన ఒక చిన్న అందమైన కుందేలు విషయుం తెలుసుకుని తెలివిగా ఏనుగుకాలిలో వుుల్లును తీసివేసింది. ఏనుగుకి ప్రాణం లేచి వచ్చినట్లయింది.కుందేలుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోరుుంది.

కొద్దిరోజుల తర్వాత కుందేలు తన బొరియును బాగు చేసుకుంటుండగా ఒక తోడేలు దాని మీద దాడిచేసేందుకు ప్రయుత్నించింది.
 అదే సవుయుంలో అటుగా వస్తున్న ఏనుగు తనను కాపాడిన కుందేలుకు ప్రాణగండం ఉండని గవునించి కుందేలును వచ్చి తన మీద ఎక్కి కూర్చోవుని బిగ్గరగా అరిచింది. అంతే! కుందేలు ఒక్క ఉదుటున ఏనుగు పెకైక్కి కూర్చుంది. ఏనుగును చూసిన తోడేలు భయుంతో తన కాళ్లకు బుద్ది చెప్పింది. ఆ రోజు నుండి ఏనుగు, కుందేలు ప్రాణస్నేహితులయ్యూరు.
 
 

మరిన్ని వార్తలు