రెండు రోజుల్లో... సాగర్ - శ్రీశైల సందర్శనం

16 Oct, 2014 23:25 IST|Sakshi
రెండు రోజుల్లో... సాగర్ - శ్రీశైల సందర్శనం

హాయిగా వెళ్లి రండి!
 
సుందరమైన ప్రదేశాలకూ, ఆధ్యాత్మిక సౌరభాలకూ తెలుగు నేల పెట్టింది పేరు. నాగార్జునసాగర్ వద్ద కృష్ణానది పరవళ్లనూ, శ్రీశైలంలో మల్లన్ననూ చూసి తరించాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రెండు రోజులకు గాను ఓ కొత్త ప్యాకేజీని రూపొందించింది.
 
మొదటి రోజు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్‌కు రోడ్డుమార్గాన నాన్ ఎ.సి. కోచ్‌లో ప్రయాణం. నాగార్జున సాగర్ డ్యామ్ సందర్శన, నాగార్జునకొండ మ్యూజియానికి లాంచీలో షికారు. అనంతరం నాగార్జునకొండ సందర్శనం, అటు తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీలో ప్రయాణం. అక్కడి హరిత హోటల్‌లో బస, మల్లికార్జునస్వామి దేవాలయ సందర్శన, రాత్రి భోజనం. మరుసటి రోజు ఉదయాన ఆలయ సందర్శన (కావాలనుకున్నవారికి...), అల్పాహారం, పాతాళగంగ రోప్‌వే సదుపాయం, గిరిజన మ్యూజియం సందర్శన, మధ్యాహ్నం భోజనం. ఫర్హాబాద్ అటవీ (టైగర్ వ్యూ పాయింట్) సందర్శన అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.
 
 హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్‌కు వెళ్లి తిరిగొచ్చే ప్యాకేజీ కూడా ఉంది.
 
 ఈ ప్యాకేజీలో:   బుధవారం: పెద్దలకు (ఒకరికి): రూ.2,900, పిల్లలకు  (3 ఏళ్ల వయసు నుంచి10 ఏళ్ల వయసు లోపు) (ఒకరికి) రూ.2,300 రుసుము.
     
 శని, ఆదివారాలు: పెద్దలకు (ఒకరికి) రూ.3,200, పిల్లలకు (ఒకరికి) రూ. 2,500గా రుసుము నిర్ణయించారు. ప్రయాణంలో: నాన్ ఎ.సి. కోచ్, క్రూయిజ్, నాన్ ఎ.సి. గదిలో బస (ఇద్దరికి), భోజనం (శాకాహారం).
     
 ఇక, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి (వన్ వే) లాంచీలో ప్రయాణానికి చార్జీలు, మధ్యాహ్న భోజనం, స్నాక్స్‌తో కలిపి...
 పెద్దలకు: (ఒకరికి) రూ.1,000, పిల్లలకు: (ఒకరికి) రూ.800 రుసుము.
     
 దర్శన టికెట్ చార్జీలు అదనం.
     
 మరిన్ని వివరాలకు: హైదరాబాద్: బషీర్‌బాగ్ ఆఫీస్ ఫోన్: 040-66746370, సెల్: 98485 40371
 
 పర్యాటక భవన్, బేగంపేట్: ఫోన్ నం. 040-23414334, 98483 06435
     
 ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నం: 1800 42545454
 
 

మరిన్ని వార్తలు