విష్ణుమయం

6 Sep, 2017 00:40 IST|Sakshi
విష్ణుమయం

ఆత్మీయం

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీహరి. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ తానుంటానన్నాడు కాబట్టి విష్ణువును స్థితికారుడనీ, సమస్త ప్రాణులనూ రక్షించే వాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. విష్ణువు అంటే విశ్వమంతా నిండిన వాడని అర్థం. ఈ సృష్టిలో అత్యుత్తమమైనవిగా పేర్కొనదగ్గ జ్ఞానం, అమరత్వం, వాత్సల్యం, సౌశీల్యం మొదలైన సమస్త సద్గుణాలు, నవరస భరితాలైన వస్తు వాహనాభరణాలు, రాజోపచారాలు, దైవోపచారాలు, సమస్త సదాచారాలకు ఆధారభూతమైన సంపదలన్నింటికీ శ్రీహరే ఆధారభూతుడు. సమస్త దేవగణాదులలోనూ విష్ణువు కంటే మిన్న అనదగ్గవాడు లేడు.

అదేవిధంగా ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రం కంటె అధికమైనది లేదు. దుష్టరాక్షసులకు వరాలనిచ్చి, లోకాలను ఇబ్బందుల పాలు చేసి, చివరకు తాము కూడా ఇబ్బందుల పాలైన బ్రహ్మను, మహేశ్వరుడినీ కూడా విష్ణువే కాపాడిన ఉదంతాలు మనం చూస్తుంటాం. మంత్రపుష్పం అంతా విష్ణుమయమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుభగవానుని విశేషాలు తెలిపేవే విష్ణు సహస్రనామాలు. ఈ నామాలన్నీ విశ్వవ్యాప్తమైన ఆయన శక్తిని, అనంతమైన ఆయన లీలలనూ తెలియచేస్తూ, మనం ఏ రూపంలో భగవంతుడిని కొలిచినా దేవుడొక్కడే అనే భావనను కలుగచేస్తాయి.

మరిన్ని వార్తలు