బ్యూటిప్స్‌

15 Mar, 2019 02:05 IST|Sakshi

►వాతావరణంలో దుమ్మూ, ధూళి ఎక్కువై చర్మ సమస్యలు అధికంగా పెరిగిపోయాయి. ఎక్కువగా, చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వలన మొటిమలు వస్తుంటాయి.

►మొటిమలు తగ్గించుకోవటానికి ఒక అరటి పండుని గుజ్జుగా చేసి ఒక టేబుల్‌ స్పూన్‌ పుచ్చకాయ రసాన్ని కలపాలి.

►ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాల మీద రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

►అరటిపండులో ఉండే విటమిన్‌ బి2,విటమిన్‌ బి6, విటమిన్‌ బి12 మీ చర్మం పొడి బారకుండా చేసి మృదువుగా ఉంచుతుంది.

►పుచ్చకాయ రసం మీ చర్మం పై ఉన్న జిడ్డుని తగ్గించి ఎక్కువ సేపు మీ ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. 

 

మరిన్ని వార్తలు