ఆచార్య ఎన్.గోపి ‘వృద్ధోపనిషత్’కు హిందీ (ఆర్. శాంతసుందరి), ఇంగ్లిష్(ఎం.శ్రీధర్, అల్లాడి ఉమ) అనువాదాల ఆవిష్కరణ జనవరి 20న సాయంత్రం 5:30కు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. జి.ఎస్.పి. రావు, వోలేటి పార్వతీశం, వి.హర్షవర్ధన్, కిల్లాడ సత్యనారాయణ, మామిడి హరికృష్ణ, సిరిసిల్ల చందన పాల్గొంటారు. నిర్వహణ: కిన్నెర ఆర్ట్ థియేటర్స్.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఆకాశవాణి నిర్వహించే 22 భాషల సర్వ భాషా కవి సమ్మేళనంలో చదివిన కవితల తెలుగు అనువాదాలను తెలంగాణ, ఆంధ్ర కవులు జనవరి 22న ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో వినిపిస్తారు. ఈ సమ్మేళనానికి తెలుగు తరఫున ఎంపికైన మామిడి హరికృష్ణతో పాటు కొలకలూరి ఇనాక్, ఎన్.గోపి, కె.శివారెడ్డి, దేవిప్రియ పాల్గొంటారు.
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రచన ‘ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యాంతరంగం’ ఆవిష్కరణ జనవరి 22న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. నాళేశ్వరం శంకరం, కె. శివారెడ్డి, గురిజాల రామశేషయ్య, పి.సి.రాములు, ఎం.నారాయణశర్మ, సీహెచ్ ఉషారాణి పాల్గొంటారు. నిర్వహణ: పాలపిట్ట బుక్స్.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెలువడిన వివిధ రచయితల వ్యాసాల సంకలనం ‘కశ్మీర్:బహిరంగ చెరసాల’ (సంపాదకుడు: ఎస్.ఎ.డేవిడ్) ఆవిష్కరణ జనవరి 24న సా.6 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగనుంది. జహీర్ అలీఖాన్, గౌహర్ జిలానీ, కె.శ్రీనివాస్, కె.శ్రీనివాసరెడ్డి, బి.రమాసుందరి, ఎన్.వేణుగోపాల్ పాల్గొంటారు. నిర్వహణ: మలుపు, ప్రెస్ క్లబ్.
బొందుగులపాటి సాహితీ పురస్కారానికి 2017, 18, 19లో ప్రచురించిన తెలంగాణ రచయితల జానపద సాహిత్య సంబంధ రచనలను ఆహ్వానిస్తోంది సాహితీ గౌతమి. పురస్కార నగదు 5 వేలు. జనవరి 31లోగా 4 ప్రతులను గాజుల రవీందర్, 8–3–255/1, రామచంద్రాపూర్ కాలనీ, రోడ్ 12, కరీంనగర్–505001 చిరునామాకు పంపాలి. ఫోన్: 9848255525