కామినీ షరాఫ్ ఫ్యాషన్‌యాత్ర

30 Sep, 2014 00:15 IST|Sakshi
కామినీ షరాఫ్ ఫ్యాషన్‌యాత్ర

దేశంలోని ప్రముఖ డిజైనర్ల ఫ్యాషన్ కలెక్షన్‌ను కామినీ షరాఫ్ నగరానికి తీసుకొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో అక్టోబర్ 9న ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. మ్యోహో, ఆర్తీ విజయ్ గుప్తా, ప్రియా థోలియా, జూలీ, ఏక్ కార్ఖానా, ఓసా, ఎరుమ్, అలోక్ బైద్, సిల్క్‌వార్మ్, ప్రియంవద, లీలా, హీనా కొచ్చర్, ఆయేషా మన్‌మీరా, ఆరిషి, జేబైష్, నవ్య, మోనికా భయానా, ప్రీతి ఝవార్, ఆయినా వంటి డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్ దుస్తులు, జ్యువెలరీ కలెక్షన్‌ను ఈ ప్రదర్శనలో నగరవాసులకు అందుబాటులో ఉంచనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఛోటీ, లిటిల్ వార్డ్‌రోబ్, మిమోసా, ఓన్స్ బ్రాండ్స్, షీర్ కిడ్స్‌వేర్, మి డల్సె, అన్యా ఆర్గానిక్ చిక్, శ్రుతి జలాన్ ఎన్ లిటిల్ ప్లెజర్స్ వంటి ఫ్యాషన్ దుస్తులను కూడా ప్రదర్శించనుండటం విశేషం. వీటితో పాటు బ్యాగులు, శాలువలు, పాదరక్షలు, హోమ్ డెకర్స్ కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు