గర్భిణుల్లో అపోహలను తొలగించాలి

6 Mar, 2019 11:35 IST|Sakshi
సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ సీతాకుమారి

భట్టిప్రోలు పీహెచ్‌సీ డాక్టర్‌ సీతాకుమారి 

సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్‌సీ డాక్టర్‌ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్‌సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ  వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు. 

పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి
వెల్లటూరు పీహెచ్‌సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్‌ సీహెచ్‌ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు