సాక్షి, గుంటూరు : 112వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ఈతేరు శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. అక్కడ నుంచి చుండూరుపల్లి, మాచవరం చేరుకుంటారు. అక్కడ జనంతో మమేకం అవుతారు. అనంతరం ములుకుదురు మీదగా చింతలపూడి చేరుకుని, అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఐలాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ ఆయన 1,496.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.