సాక్షి, గుంటూరు: కరోనా వచ్చిందని కన్నతల్లిని కుమారుడు బస్టాండులో వదిలేసిన ఘటన గురువారం మాచర్లలో చోటు చేసుకుంది. పాల్వని(70) కొన్ని సంవత్సరాలుగా గోవాలోని కూతురి వద్ద ఉంటోంది. రెండు రోజుల క్రితం గోవా నుంచి పెన్షన్ కోసం మాచర్లకు వచ్చింది. వేరే రాష్ట్రం నుంచి రావడంతో ఆమెకు డాక్టర్లు కరోనా టెస్టులు చేయగా, పాజిటివ్గా తేలింది. దీంతో పాల్వని కుమారుడు వెంకటేశ్వరరావు ఆమెను బస్టాండ్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతొ వృద్ధురాలిని అధికారులు గుంటూరులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు.