సాక్షి, గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన పొన్నూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి కనుకర్రు చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ వల్లభరావుపాలెం చేరుకుంటారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,508.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.