బాంబు దాడుల్లో 11 మంది మృతి

12 Jul, 2017 18:58 IST|Sakshi

అబుజా: నైజీరియాలోని  మైదుగురి నగరంలో రెండు వరుస బాంబుదాడులు జరిగాయి. నగరంలోని ములైకల్ ములైకల్‌మారి, సాబోన్‌ గారి అనే రెండు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకోవడంతో వారితో సహా 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

బోకో హరమ్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు ఈ దాడులకు పాల్పడి ఉంటారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బోకో హరమ్ ఉగ్ర సంస్థ తిరుగుబాటు దాడుల్లో 2009 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 వేల మంది చనిపోయారు. సుమారు 23 లక్షల మంది ఇళ్లు వాకిలీ వదిలి వేరే ప్రదేశాలకు వెళ్లిపోయారు.
 

 

మరిన్ని వార్తలు