మీర్పేటలో లారీ బీభత్సం

9 Nov, 2015 08:39 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని మీర్ పేట జంక్షన్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ స్కూలు బస్సుపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి స్కూలు బస్సును ఢీకొట్టింది. అనంతరం ఒక ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది.

ఈ ఘటనలో స్కూలు బస్సులో ఉన్న నలుగురు విద్యార్థులతో పాటు ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు