శంషాబాద్ లో మళ్లీ బంగారం స్వాధీనం

11 Mar, 2016 09:33 IST|Sakshi
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. శక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 465 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు దుబాయి నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను సోదా చేయగా ప్రయాణికుడి వద్ద బంగారం లభించింది. అందుకు సంబందించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ప్రయాణికుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 
మరిన్ని వార్తలు