700 కిలోల గంజాయి పట్టివేత

30 Dec, 2015 13:04 IST|Sakshi

విశాఖ జిల్లా అనకాపల్లి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు రూ.21 లక్షల విలువైన గంజాయిన పట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం మాడుగుల ఘాట్‌రోడ్డులో తనిఖీలు చేయగా వ్యానులో తరలిస్తున్న రూ.21 లక్షలకు పైగా విలువైన 700 కిలోల గంజాయి దొరికింది. ఇందుకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యాను సహా గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


 

మరిన్ని వార్తలు