'అశ్లీల సైట్ల నిరోధానికి చర్యలు తీసుకుంటాం'

9 Jul, 2015 08:23 IST|Sakshi

న్యూఢిల్లీ: అశ్లీల(పోర్న్) సైట్ల నిరోధానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకురాగా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు