5న ఏపీ ఎంసెట్‌–17 ఫలితాలు

3 May, 2017 20:20 IST|Sakshi
5న ఏపీ ఎంసెట్‌–17 ఫలితాలు

కాకినాడ: ఏపీ ఎంసెట్‌–17 ఫలితాలు మే 5న విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్యశాఖా మంత్రి  కామినేని శ్రీనివాసరావు, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ విజయరాజు హాజరై విడుదల చేస్తారని, అనంతరం అర గంటలోగా విద్యార్థుల మొబైల్‌కు మార్కులు, ర్యాంకుల సమాచారం వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు