ఉగ్రవాదుల డంప్ స్వాధీనం

6 Aug, 2017 13:44 IST|Sakshi
శ్రీనగర్: ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా  ‘ఆపరేషన్ క్లీన్ అప్’  చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా బలగాలు ఉగ్రవాదుల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్లోని రజౌరీ పర్వత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన బలగాలు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని గుర్తించారు. అందులో ఓ ఏకే-47, ఓ ఏకే 57, ఓ పిస్టల్‌, 5 గ్రానెడ్లు, రెండు మ్యాగ్‌జీన్లు, 639 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
మరిన్ని వార్తలు