లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బాలకృష్ణ

1 Mar, 2016 16:54 IST|Sakshi

అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. విశాఖపట్నం కలెక్టరేట్‌లోని అర్బన్ లాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ సర్వేయర్ గా  పనిచేస్తున్న బాలకృష్ణ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు.

మర్రిపాలెంలోని హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్ భవన నిర్మాణానికి ఎన్ ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లక్షన్నర డిమాండ్ చేయగా, రూ. 50వేలకు బేరం కుదుర్చుకున్నారు. హుస్సేన్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని బాలకృష్ణను పట్టుకున్నారు.

 

మరిన్ని వార్తలు