52 కేజీల గంజాయి పట్టివేత

25 Jun, 2017 18:04 IST|Sakshi

కామారెడ్డి: జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తోన్న మోహన్‌ రావు, శంకర్‌రావు అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 52 కేజీల గంజాయి, తూపాను వాహనం, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ ప్రసన్న రాణి విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

మరిన్ని వార్తలు