మరోసారి రెచ్చిపోయిన చైన్స్నాచర్లు

23 Feb, 2016 08:19 IST|Sakshi
కుషాయిగూడ : నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. చక్రిపురం క్రాస్‌రోడ్డులో బాలమణి అనే మహిళ మంగళవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుపోయారు. ఆమె తేరుకుని చుట్టు ప్రక్కల వారికి సమాచారం ఇచ్చే లోపల దుండుగులు పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
మరిన్ని వార్తలు