కరీంనగర్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా సోమవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తూర్పుద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన కేసీఆర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు సీఎంకు తీర్థ ప్రసాదాలు అందించారు. అయుత చండీయాగాన్ని ఘనంగా నిర్వహించిన కేసీఆర్ అర్చకుల సూచన మేరకు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.