కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

16 Sep, 2015 13:32 IST|Sakshi

హైదరాబాద్ : ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి అనే యువ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి బంధువులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరుపుతోంది. సంఘటనపై వివరాలు తెలియాల్పి ఉంది.
 

మరిన్ని వార్తలు