పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెద్దపల్లిలోని మదర్ థెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ గా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాలోని చిట్యాలకు చెందిన ప్రశాంత్ పెద్దపల్లిలో చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.