రైతుల ఆందోళన, కంప్యూటర్లు ధ్వంసం

30 Sep, 2015 12:59 IST|Sakshi

వరంగల్: వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం మార్కెట్ లో పత్తి ధర అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో రైతులు ఆగ్రహంతో యార్డులోని కంప్యూటర్ లను ధ్వంసం చేశారు. ఈ- మర్కెట్ లోని సీక్రెట్ టెండర్ల వల్లే అన్యాయం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కుమ్మక్కుతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళనతో వ్యవసాయ మార్కెట్ భారీగా పోలీసులు మోహరించారు.
 

మరిన్ని వార్తలు