పెప్సీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

25 Dec, 2015 16:25 IST|Sakshi
హయాత్‌నగర్: నగరంలోని హయత్‌నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెంలో పెప్సీ గోడౌన్ లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లోని స్క్రాప్‌లో నిప్పు రవ్వలు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 
>
మరిన్ని వార్తలు